భారత్, పాక్ సరిహద్దు: పైప్లైన్లో గ్యాస్ లీక్ (వీడియో)
జైసల్ మీర్: ఆయిల్ ఇండియాకు చెందిన పైప్ లైన్ లో గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు హడలిపోయారు. పెద్ద ఎత్తున గ్యాస్ ఎగిసిపడటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులు, నిపుణులు సరైన సమయంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
భారత్-పాక్ సరిహద్దులో రాజస్థాన్ లోని జై సల్ మీర్ నగర సమీపంలోని దండేవాల ప్రాంతంలో గ్యాస్ సరఫరా చేసే భారీ పైప్ లైన్ ఉంది. అయితే ఒక్క సారిగా పైప్ లు పగిలిపోవడంతో గ్యాస్ పెద్దఎత్తున ఎగిసిపడింది. విషయం గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో పైప్ లైన్ లో గ్యాస్ సరఫరా చెయ్యడం నిలిపివేశారు. మంగళవారం ఆయిల్ ఇండియా నిపుణులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమత్తులు చేసి గ్యాస్ లీక్ ను అదుపు చేశారు. అయితే ఒక్క వారం నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతున్నదని, నిపుణలు లేక పట్టించుకోలేదని స్థానిక మీడియా ఆరోపిస్తున్నది.