‘నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు’: మావో దాడిపై గంభీర్ తీవ్ర స్పందన
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అన్నారు. ఛత్తీస్ఢ్లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు..
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అన్నారు. ఛత్తీస్ఢ్లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు..సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిపిన సంగతి తెలిసిందే.
Chattisgarh, Kashmir, North East,do v need more alarm bells or r we a deaf state?Life of my countrymen isn't cheap,someone needs 2 pay 4 it
— Gautam Gambhir (@GautamGambhir) April 24, 2017
ఈ ఘటనలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు. 'ఛత్తీస్గఢ్, కాశ్మీర్, ఈశాన్యం... మనకు ఇంకా ప్రమాద ఘంటికలు అవసరమా? లేదంటే మనం చెవులు వినిపించని స్థితిలో ఉన్నామా? నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు. దీనికి ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే' అని గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.
As we crib over lack of air conditioning or size of our already mammoth SUV, let's ponder over d future of d daughters of CRPF martyrs. pic.twitter.com/XhBbbaFEgD
— Gautam Gambhir (@GautamGambhir) April 26, 2017
For every slap on my army's Jawan lay down at least a 100 jihadi lives. Whoever wants Azadi LEAVE NOW! Kashmir is ours. #kashmirbelongs2us
— Gautam Gambhir (@GautamGambhir) April 13, 2017
కాగా, కాశ్మీర్లో ఆందోళన కారులు జవాను చెంపపై కొట్టినప్పుడు 'నా జవాన్పై పడ్డ ప్రతి దెబ్బకు కనీసం 100 జిహాదీల ప్రాణాలు పోతాయి. ఆజాదీ కావాలనుకొనేవారు వెళ్లిపోండి. కాశ్మీర్ మాది' అని గంభీర్ ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే.