Gandhi Peace Prize: గాంధీ శాంతి బహుమతిపై నెలకొన్న వివాదం.. రూ.కోటిని తిరస్కరించిన గీతాప్రెస్..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన గీతాప్రెస్‌కు కేంద్ర ప్రభుత్వం 2021 గానూ 'గాంధీ శాంతి బహుమతి ని ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డు కింద రూ.కోటి నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక అందించనుంది. అయితే, గీతాప్రెస్‌ కోటి రూపపాయల నగదును తిరస్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మత గ్రంథాలను ప్రచురించే గోరఖ్‌పూర్‌కు చెందిన గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బహుమతి రావడంపై వివాదం నెలకొంది.

అవార్డు ప్రకటించిన తర్వాత ఆదివారం ఆలస్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సమావేశమైన ప్రెస్ ట్రస్టీ బోర్డ్, సోమవారం నాడు 2021కి అవార్డును ప్రదానం చేయడం గొప్ప విషయమని, అయితే కోటి రూపాయల నగదును అంగీకరించబోమని చెప్పారు. ఏ రకమైన "విరాళాలు" స్వీకరించకూడదనే దాని సంప్రదాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు

సనాతన ధర్మ సూత్రాలను ప్రచారం చేసినందుకు గాను 1923లో జయ దయాళ్ గోయంకా, ఘనశ్యామ్ దాస్ జలాన్‌లు స్థాపించిన గీతా ప్రెస్‌కి అవార్డును ప్రదానం చేసినందుకు పబ్లిషర్ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. "ఇది మాకు చాలా గౌరవప్రదమైన విషయం. ఎలాంటి విరాళాలు తీసుకోకూడదనేది మా సూత్రం, కాబట్టి ట్రస్టీ బోర్డు ఎటువంటి ద్రవ్య రూపంలో అవార్డు తీసుకోకూడదని నిర్ణయించింది. అయితే, మేము అవార్డును ఖచ్చితంగా స్వీకరిస్తాము" అని అన్నారు.

 gandhi

గాంధీ శాంతి బహుమతికి గీత ప్రెస్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ముస్లిం లీగ్‌ను లౌకిక సంస్థగా భావించే వారికి తప్ప దాని ఎంపికపై ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. "గీత ప్రెస్ భారతదేశ సంస్కృతి, మన ధర్మం, హిందూ విశ్వాసంతో ముడిపడి ఉందన్నారు. ఇది ప్రతి ఇంటికీ చేరే సరసమైన సాహిత్యాన్ని ఉత్పత్తి చేస్తుందని" అని ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో చెప్పారు.

గాంధీ శాంతి బహుమతితో గీతా ప్రెస్‌ను గౌరవించాలనే నిర్ణయం "నిజంగా ఒక అవహేళన" "ఇది సావర్కర్, గాడ్సేకి అవార్డు ఇవ్వడం లాంటిది" అని జైరామ్ రమేష్ ఆదివారం ఆరోపించారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌, మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్‌ గాడ్సే గురించి రమేష్‌ ప్రస్తావించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఆరోపణలు చేస్తున్న వారు ఎవరు? ముస్లిం లీగ్ సెక్యులర్ అని చెప్పే వారు. రెండు దేశాల సిద్ధాంతాన్ని అందించి, భారతదేశాన్ని విభజించి, పాకిస్థాన్‌ను సృష్టించిన ఘనత ముస్లిం లీగ్ అని కాంగ్రెస్ మర్చిపోయిందని అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గీతా ప్రెస్‌ని అభినందించారు. నిస్వార్థంగా అనేక పవిత్ర గ్రంథాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇది అద్భుతమైన పని చేస్తుందని అన్నారు. "అహింసా, ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు అందించిన విశిష్ట సహకారానికి" గుర్తింపుగా గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌కి 2021 గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయనున్నట్లు ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది.

గాంధీ శాంతి బహుమతి గ్రహీతగా గీతా ప్రెస్‌ను ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ప్రకటన పేర్కొంది." భారతీయ ప్రాచీన సనాతన సంస్కృతిని, మూల గ్రంథాలను ఈరోజు సులభంగా చదవగలిగితే, ఇందులో గీతా ప్రెస్‌కి సాటిలేని సహకారం ఉంది. 100 సంవత్సరాలకు పైగా, రామచరిత్ మానస్ నుంచి అనేక పవిత్ర గ్రంథాలను నిస్వార్థంగా తీసుకొని గీతా ప్రెస్ అద్భుతమైన పని చేస్తోంది. శ్రీమద్ భగవద్గీతను ప్రజలకు తెలియజేయండి" అని షా హిందీలో ట్వీట్‌ చేశారు.

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కూడా గీతా ప్రెస్‌ని అభినందించారు. భారతదేశ 'సనాతన్ సంస్కృతి' పరిరక్షణ, అభివృద్ధిలో గత 100 సంవత్సరాలుగా దాని సహకారం ప్రశంసనీయమని అన్నారు. భారతదేశ మహిమాన్వితమైన సనాతన సంస్కృతిని పరిరక్షించడంలో, అభివృద్ధి చేయడంలో గత 100 సంవత్సరాలుగా మీ సహకారం అభినందనీయం అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ విమర్శలను విశ్వహిందూ పరిషత్ (VHP) ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+