మోడీ అమెరికా పర్యటన వేళ కీలక ఒప్పందం: యుద్ధ విమానాల ఇంజిన్లు ఇక భారత్లో తయారీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన క్రమంలో భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మనదేశంలోనే ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జనరల్ ఎలక్ట్రిక్(జేఈ) ఏరోస్పేస్(GE Aerospace)తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) కీలక అవగాహణ ఒప్పందం జరిగింది. ఈ ఇంజిన్లను భారత వాయుసేనకు చెందిన తేజస్ మార్క్-2 యుద్ధ విమానాల్లో అమరుస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. జీఈ ఏరోస్పేస్కు చెందిన ఎఫ్414 ఇంజిన్లను హెచ్ఏఎల్త కలిసి భారత్లోనే తయారు చేసేందుకు ఒప్పందం కుదిరిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి కావాల్సిన ఎగుమతి అనుమతులను తీసుకోనున్నట్లు తెలిపింది.

హెచ్ఏఎల్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని భారత్-అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యంలో కీలక ముందడుగుగా అభివర్ణించింది. అంతేగాక, ఇది ఒక చారిత్రక ఒప్పందంగా జీఈ ఏరోస్పేస్ ఛైర్మన్, సీఈవో లారెన్స్ కల్స్ జూనియర్ తెలిపారు. కాగా, ఫైటర్ యుద్ధ విమానాల్లో జెట్ ఇంజిన్లదే కీలక పాత్ర. జెట్ ఇంజిన్ల తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా వద్ద మాత్రమే ఉంది.
దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించలేదు. రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకూ అనేక అంశాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించినప్పటికీ.. జెట్ ఇంజిన్ విషయంలో మాత్రం పురోగతి లేదు. ఈ క్రమంలో తాజా ఒప్పందం భారత్కు ఎంతో కీలకమని చెప్పవచ్చు.
కాగా, జేఈ-ఎఫ్404 ఇంజిన్ కన్నా.. జేఈ ఎఫ్414 శక్తివంతమైనది. పాతబడిపోతున్న మిరాజ్-2000, మిగ్-29, జాగ్వార్ యుద్ధ విమానాల స్థానంలో ప్రవేశపెట్టిన తేజస్ మార్క్-2 యుద్ధ విమానంలో ఈ ఇంజిన్ను అమరుస్తారు. ఎఫ్414 ఇంజిన్.. 1970లలో అభిృద్ధి చేసిన ఎఫ్404 ఇంజిన్కు సంబంధించిన కొత్త వెర్షన్. దీని ప్రత్యేకతల దృష్త్యా ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్, ఈఏ-18జీ గ్రౌలర్ సహా అనేక యుద్ధ విమానాలకు దీన్ని ఎంపిక చేశారు.
ఎఫ్404 ఇంజిన్ 90 కిలోన్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీఈ-ఎఫ్414 ఇంజిన్ దాదాపు 98 కిలోన్యూటన్ల శక్తిని వెలువరిస్తుంది. ఎఫ్414కు తిరుగులేని విశ్వసనీయత ఉంది. ఈ ఇంజిన్లు అమర్చిన విమానాలు కోటి గంటలు గగన విహారం చేయడం గమనార్హం. వీటి నిర్వహణ చాలా సులువు. దీంతో ఖర్చులు కూడా తగ్గుతాయి.
ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్(FADEC) వ్యవస్థ కలిగిన మొదటి ఫైటర్ ఇంజిన్ ఇదే. దీని వల్ల ఇంజిన్ పనితీరును అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించడానికి వీలవుతుంది. ఇంధన సమర్థత కూడా పెరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ ఇనిస్టూమెంటేషన్(IEE) కలిగిన తొలి జెట్ కూడా ఇదే కావడం గమనార్హం. దీంతో ఇంజిన్ పనితీరుపై రియల్ టైమ్ డేటా అందిస్తుంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications