సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన గిరిజా వైద్యనాథన్, మరో బాధ్యత కూడా..
తమిళనాడు కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్టేట్ విజిలెన్స్ కమిషనర్గా కూడా బాధ్యతలను స్వీకరించారు.
చెన్నై: తమిళనాడు కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్టేట్ విజిలెన్స్ కమిషనర్గా కూడా బాధ్యతలను స్వీకరించారు. గిరిజా వైద్యనాథన్ 1981 బ్యాచ్కు చెందిన అధికారిణి.
కాగా, ఐటీ దాడులకు గురైన సీఎస్ రామ్మోహన రావుపై తమిళనాడు ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయనను ఆ పదవి నుంచి తప్పించి, వెయిటింగ్లో ఉంచింది. రామ్మోహన రావు స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథనను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన రామ్మోహన రావును మాజీ సీఎం జయలలిత, గత జూన 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆమె మృతి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా రామ్మోహన రావు, ఆయన కుటుంబీకులు, సన్నిహితులు ఇళ్లు, నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

దాంతో, ఆయన్ని తొలగించాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ గట్టిగా డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపిన సీఎం పన్నీర్ సెల్వం.. రామ్మోహన రావును తొలగించారు. ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథనను నియమించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications