స్కూల్ వద్దే విధ్యార్థిని తల్వార్తో నరికి చంపిన యువకుడు, ఎందుకంటే?
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. పాఠశాల గేటుకు సమీపంలోనే విద్యార్ధినిపై ఓ యువకుడు తల్వార్తో విచక్షణ రహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన గురువారం నాడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కోట్యాలో చోటు చేసుకొంది
టీచర్లు, విద్యార్థుల ముందే ఆమెను తలనరికి కిరాతకంగా హతమార్చాడు. అనుప్పూర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. కోట్మా పట్టణానికి చెందిన 17 ఏళ్ల పూజా పనికా, నిగ్వాని రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన పూజను ఓ యువకుడు వెంబడించాడు. పాఠశాల గేట్ వద్దకు చేరుకోగానే అప్పటిదాకా తనతో దాచుకున్న తల్వార్ను తీసి ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు.
దీంతో పూజ వీపు, మెడ, గొంతు భాగంలో పొడిచాడు. కత్తి పోట్లకు ఆమె తల తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్లు, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.మరో వైపు ఈ ఘటనను చూసిన స్థానికులు నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు.
2014లో యువతిని వేధించాడన్న కారణంగా దిలీప్ సాహూ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు దిలీప్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీస్ అధికారి విజయ్ సింగ్ తెలిపారు. స్కూల్ ఆవరణలోనే అందరి ముందు ఈ భయానక ఘటన చోటు చేసుకోవటంతో వారం రోజులు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.