వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: 8వ తరగతి బాలికపై రేప్ చేసి తగులబెట్టారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

UP
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. జలౌన్ జిల్లాలోని సిర్సా కలార్ ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడి ఆపై ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా ఉండేందుకు తగులబెట్టారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎనభై శాతం కాలిన బాలిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది.

మంగళవారం మృతి చెందిన బాలిక తన సోదరితో కలిసి పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

తనను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడటంతో ఆ బాలిక తాను అందరికీ చెబుతానని వారిని బెదిరించింది. దీంతో నిందితులు ఆమెను అక్కడే తగులబెట్టారు. అనంతరం వారు ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు.

మృతురాలు సోదరి అక్కడి నుండి తప్పించుకొని వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలియజేసింది. వారంతా సంఘటన స్థలానికి చేరుకునేసరికి బాలిక ఎనభై శాతం కాలిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇంకా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
He however had added that based on the information available, police teams were raiding different locations in pursuit of the assailants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X