భర్త ముందే నవవధువుపై మామ, బంధువు గ్యాంగ్రేప్
రాంచీ: వేర్వేరు మతాలకు చెందినవారు యువతీ యువకులు ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. వివాహం తర్వాత యువతిని మతం మారాలని వరుడి కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చారు. అయితే ఆమె సమ్మతించకపోవడంతో గ్యాంగ్రేప్ చేసి హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్నగర్లో చోటు చేసుకొంది.
వివాహేతర సంబంధం: క్రిస్మస్ వేడుకల్లో స్నేహితుడిని చంపేసిన దంతవైద్యుడు
ప్రియుడు రేప్: రక్షిస్తామంటూ వచ్చి సామూహిక అత్యాచారం
జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గర్ జిల్లాలో దాదాపు నెలరోజుల కిందట ఓ యువతి అదృశ్యమైంది. ఆమె వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. అతడితోనే గత మాసం 6, వివాహం చేసుకొంది.
వివాహం చేసుకొన్న తర్వాత ఆమె భర్తతో కలిసి అతని బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే వరుడి తండ్రికి వరుడి బంధువు సమాచారం ఇచ్చాడు.అయితే మతం మార్చుకోవాలని యువతిని వరుడి తరుపు బంధువులు ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆమె నిరాకరించింది. రాంచీలో ఇద్దరిని ఉంచుతామని నమ్మించి రైల్వేస్టేషన్ సమీపంలోకి తీసుకెళ్ళనున్నట్టు చెప్పి ఆ యువతిని సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళారు.