ఇద్దరూ మహిళలే: ఆగ్రాలో సహజీవనం, ఆపై పెళ్లి
న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. వినడానికి ఇంది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఈ సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఆగ్రాలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్సు విభాగంలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని స్థానికంగా బ్యూటీపార్లర్ నడుపుతున్న 25 ఏళ్ల మహిళను ఎంతగానో ప్రేమించింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్పింది.

ఇందుకు విద్యార్ధిని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో జనవరి 4న ఇంటి నుంచి పారిపోయింది. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు జనవరి 15న సమీప పోలీస్ స్టేషన్ తమ కూతరు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దీంతో బాలిక సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆగ్రాకు సమీపంలోని ద్వేరి అనే గ్రామంలో ఆ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. భారత్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవటం చట్ట సమ్మతం కానప్పటికీ, అయితే వారిద్దరూ 18 ఏళ్లకు మించిన వారు కావడంతో వారిపై చర్యలు తీసుకోలేమని ఓ పోలీసు అధికారి తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications