మరో యువతితో పెళ్లి: ప్రియుడిపై యాసిడ్ దాడి
బిజ్నోర్: తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధాపడ్డాడనే కోపంతో ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇనాంపూర్ గ్రామానికి చెందిన అఫ్రీన్(19), దళిత వర్గానికి చెందిన సూరజ్(22)లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సూరజ్ కుటుంబసభ్యులు ఇటీవలే అతనికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు.
దీంతో తనను కాకుండా.. వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆగ్రహానికి గురైన అఫ్రీన్.. సూరజ్ ముఖంపై యాసిడ్ పోసింది. తీవ్రంగా గాయపడిన సూరజ్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
సూరజ్ ముఖం, శరీర భాగాలపై 50 శాతం గాయాలయ్యాయని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.