రైల్లో గర్ల్స్పై వేధింపులు: ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

సస్పెన్షన్ తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఉపేందర్ కుమార్ సిన్హా తెలిపారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే ధన్బాద్లో శనివారం నిర్వహించిన ఓ పరీక్ష కోసం హాజరైన కొందరు యువకులు పాట్నాలో స్టేషన్లో ఆగిన గంగా దామోదర్ ఎక్స్ప్రెస్లో బాలికలకు రిజర్వు చేసిన సీట్లలో కూర్చున్నారు. అదే సమయంలో పాట్నాలో రెండు రోజుల ఎడ్యుకేషనల్ టూర్ ముగించుకున్న ధన్బాద్, దిగ్వండిహ్ల్లోని కార్మెల్ పాఠశాలలకు చెందిన 9 నుంచి 12 తరగతి విద్యార్థులు, ఐదుగురు టీచర్లతోపాటు పాట్నా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
బాలికలకు కేటాయించిన సీట్లలో కూర్చున్న ఆ యువకులను లేవాలని అక్కడికి చేరుకున్న పాఠశాల టీచర్లు కోరారు. అయితే ఆ యువకులు సీట్లను ఖాళీ చేయకపోగా పాఠశాల విద్యార్థులు, టీచర్లపై వేధింపులకు, దూషణలకు పాల్పడ్డారు. కాగా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, యువకులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పాఠశాల టీచర్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అదే పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు బుక్ చేసుకున్న మరో బోగీలో ఎక్కి ధన్బాద్కు చేరుకున్నామని టీచర్లు తెలిపారు. బాలికలు, టీచర్ల వాదనలను వినేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ధన్బాద్కు పంపించినట్లు ఉపేందర్ కుమార్ సిన్హా తెలిపారు. కాగా ఈ విషయంపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెంటనే విచారణ ప్రారంభించాలని రైల్వే డిజిపి పిఎన్ రావుకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications