రైతులకు మోడీ సర్కారు గుడ్న్యూస్: ఆరు పంటల కనీస మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (MSPs) మంగళవారం (అక్టోబర్ 18) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఎంఎస్పీ (కనీస మద్దతు ధరలు) పెంపు నిర్ణయం తీసుకున్నారు.
#Cabinet approves Minimum Support Prices for all Rabi Crops for Marketing Season 2023-24.
— PIB India (@PIB_India) October 18, 2022
The absolute highest increase in MSP has been approved for lentil (Masur) at Rs.500/- per quintal followed by rapeseed and mustard at Rs.400/- per quintal
🔗https://t.co/4ru6083UyR pic.twitter.com/L1YY9z6JiM
2022-23 పంట సంవత్సరం (జూలై-జూన్), 2023-24 మార్కెటింగ్ సీజన్లో ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలు పండిన వెంటనే అక్టోబర్ నుంచి రబీ పంటల నాట్లు ప్రారంభమవుతాయి. గోధుమ, ఆవాలు ప్రధాన రబీ పంటలు. వీటితోపాటు మసూర్, బార్లీ, కుసుమ పంటల ఎంఎస్పీ పెంచారు.
కేంద్రం పెంచిన కనీస మద్దతు ధరలు ఇలా..
బార్లీ
ధరను
రూ.
100
పెంచడంతో
క్వింటాల్
ధర
రూ.
1735కు
పెరిగింది.
శనగల
కనీస
మద్దతు
ధరను
రూ.
5230
నుంచి
రూ.
5335కి
పెంచారు.
మసూర్
పంట
మద్దతు
ధరను
రూ.
500
పెంచడంతో
క్వింటాల్
ధర
రూ.
6000కు
చేరింది.
ఆవాల
కనీస
మద్దతు
ధరను
రూ.
5050
నుంచి
రూ.
5450కు
పెంచారు.
గోధుమలకు
కనీస
మద్దతు
ధరను
రూ.
110
పెంచారు.
దీంతో
క్వింటాల్
ధర
రూ.
2,125కు
చేరింది.
కుసుమ
పంట
మద్దతు
ధరపై
రూ.
209
పెంచారు.
దీంతో
క్వింటాల్
ధర
రూ.
5650కి
పెరిగింది.
#Cabinet approves the increase in the Minimum Support Prices (MSP) for 6 Rabi Crops for Marketing Season 2023-24.
— PIB India (@PIB_India) October 18, 2022
The increase in #MSP is in line with Union Budget 2018 announcement of fixing MSP at a level of at least 1.5 times of average cost of production pic.twitter.com/5PYQFUhTEU