Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టోల్ గేట్లకు గుడ్‌బై.. జాతీయ రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!

దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణకు స్వస్తి పలికే అవకాశం ఉంది. అటు టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు కూడా ఈ విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈ విషయాలన్ని స్వయంగా రోడ్డు రవాణా , రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో వాహనదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, ఛార్జీల మోతతో సతమతమవుతున్న వాహనదారులకు ఈ కొత్త విధానం నిజంగా ఊరటనిచ్చే అంశం. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి టోల్ ఛార్జీల భారం తగ్గించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, వేగం పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.

Annual Rs 3 000 Toll Pass A Game Changer for Indian Motorists

వార్షిక, జీవితకాల టోల్ ఫీజులు:
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సంవత్సరానికి రూ.3,000 లేదా 15 సంవత్సరాలకు ఒకేసారి రూ.30,000 చెల్లించేలా వార్షిక , జీవితకాల టోల్ ఫీజులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి నిరంతరాయంగా ఆదాయం వస్తుంది. అంతేకాకుండా, టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు నిరీక్షించే సమయం ఆదా అవుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చు.

శాటిలైట్ టోలింగ్, ANPR టెక్నాలజీతో టోల్ వసూళ్లు సులభతరం!
రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, శాటిలైట్ ఆధారిత టోలింగ్ విధానం గురించి కమిటీలు చర్చిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) మరియు FASTag సాంకేతికతలను ఉపయోగించి టోల్ వసూళ్లను మరింత సులభతరం చేయాలని నిపుణుల ప్యానెళ్లు సిఫారసు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండానే ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి టోల్ ఛార్జీలు ఎంతో అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. "మంచి రోడ్డు కావాలంటే దానికి డబ్బు చెల్లించాలి అనేది మా విధానం" అని ఆయన కుండబద్దలు కొట్టారు. నాణ్యమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు టోల్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

టోల్ ప్లాజాల మధ్య దూరంపై స్పష్టమైన నిబంధనలు!
2008 నిబంధనల ప్రకారం, ఒకే జాతీయ రహదారిపై రెండు టోల్ ప్లాజాల మధ్య కనీసం 60 కిలోమీటర్ల దూరం ఉండాలి. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు జాతీయ రహదారుల ఫీజు నియమాలు, 2008 ప్రకారం నడుస్తాయి. 2023-24లో టోల్స్ ద్వారా రూ.64,809.86 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35% ఎక్కువ కావడం విశేషం.

కొత్త టెక్నాలజీతో టోల్ వసూలు విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ విధానం అమల్లోకి వస్తే జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభంగా, ఆహ్లాదకరంగా మారుతుందనడంలో సందేహం లేదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+