2వేల నోటుకు మంగళం పాడనున్న ప్రభుత్వం
Recommended Video

రెండేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దుతో రంగప్రవేశం చేశాయి రూ.2వేల నోట్లు. పెద్ద నోట్లు రద్దవడంతో కొత్తగా ప్రభుత్వం ఈ రెండువేల నోటును ప్రవేశ పెట్టింది. నాడు రెండువేల నోటు పొందేందుకు కస్టమర్లు గంటల తరబడి బ్యాంకు క్యూలైన్లలో నిల్చున్నారు. ఇప్పుడు ఆ నోటు కనుమరుగుకానుందా...? ఇకపై కనిపించదా..? ప్రస్తుతం ఉన్న రెండువేల నోట్లే చివరి నోట్లా... కొత్త నోట్లు ఇక రావా..?
2016, నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్ల రద్దు చేశాకా ఆ స్థానంలో రూ. 2వేల నోటును కొత్తగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నోటుకు కేంద్రం మంగళం పాడనున్నట్లు సమాచారం. ఇకపై రెండు వేల నోట్లు ముద్రణ ఆపివేసేందుకు కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేసి క్రమంగా రెండు వేల నోట్ల సర్కులేషన్ను నిలిపివేయాలని భావిస్తోంది. రెండు వేల నోట్లను కొందరు పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకుంటున్నారని అంతేకాకుండా పన్ను ఎగవేతకు, మనీలాండరింగ్లకు కూడా 2వేల నోటును వినియోగిస్తున్నారన్న అనుమానం రావడంతో ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సమాచారం. రెండువేల నోటు ముద్రణ ఆగిపోయినా చెలామణిలో మాత్రం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఈ రెండువేల నోటును ప్రవేశ పెట్టింది. మార్చి 2018 నాటికి సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ విలువ మొత్తం రూ.18.03 ట్రిలియన్లు. ఇందులో రూ. 6.73 ట్రిలియన్లు లేదా 37 శాతం రెండువేల రూపాయల నోటు రూపంలోనే ఉన్నాయి. రూ.7.73 ట్రిలియన్ రూపాయలు లేదా 43 శాతం కరెన్సీ రూ. 500 నోట్లు రూపంలో ఉన్నింది. మిగతా కరెన్సీ తక్కువ విలువ చేసే డినామినేషన్లో ఉన్నాయి.
దేశంలో రూ.2వేల నోటును నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టగానే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. వెయ్యి రూపాయల్లో జరిగే అవినీతిని రెట్టింపు చేసి రెండువేలకు చేర్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పెట్టొచ్చని నాడు మోడీ చెప్పారు. అయితే చిన్న మొత్తం నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో పెద్ద నోట్లను ప్రవేశ పెట్టి నల్లధనానికి చెక్ ఎలా పెడతారని విపక్షాలు మండిపడ్డాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications