పెద్ద నోట్ల ప్రింటింగ్ ఖర్చెంతో తెలుసా?: ఇదిగో వివరాలు..
ఒక్కో నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుందో చెప్పిన మేఘ్ వాల్.. మొత్తంగా కొత్త రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారన్నది మాత్రం వెల్లడించలేదు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నోట్ల ముద్రణ ఖర్చు వివరాలు వెల్లడించారు. దీనిపై రాజ్యసభకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ మేరకు కొత్త రూ.500 నోటు ముద్రణకు రూ.2.87 నుంచి రూ.3.09 ఖర్చవుతున్నట్లు వెల్లడించారు.
అదే సమయంలో రూ.2వేల నోటు ముద్రణకు ఒక్కోదానికి రూ.3.54 నుంచి రూ.3.77 వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు. నోట్ల ముద్రణ ఖర్చులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అర్జున్ మేఘ్ వాల్ ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

అయితే ఒక్కో నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుందో చెప్పిన మేఘ్ వాల్.. మొత్తంగా కొత్త రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణ ఇంకా కొనసాగుతున్నందునా.. ఇప్పుడే వివరాలు వెల్లడించడం కుదరదని ఆయన అన్నారు. కొత్త నోట్ల ముద్రణ నిర్విరామంగా కొనసాగుతుందని వివరణ ఇచ్చుకున్నారు.
కాగా, గతేడాది నవంబర్ 8న కేంద్రం పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications