గ్రీన్ పీస్ ఇండియా లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: విదేశాల నుండి నిధులు దిగుమతి చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్ జీఓ) గ్రీన్ పీస్ ఇండియా లైసెన్స్ రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
విదేశీ నిధుల నియత్రణ చట్టం (ఎఫ్ సీఆర్ఎ) దుర్వినియోగం చేస్తు భారత్ లో అభివృద్దిని అడ్డుకుంటున్నారని గ్రీన్ పీస్ సంస్థ మీద కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలోనే నిఘా వేసింది. దేశ అభివృద్దిని అడ్దుకుంటున్న ఈ గ్రీన్ పీస్ సంస్థ మీద కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు తీసుకుని ఆ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఆరోపణలపై గ్రీన్ పీస్ ఇండియా సంస్థ మండిపడింది. తమ సంస్థ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. చట్టప్రకారం తాము విదేశాల నుండి నిధులు తెప్పించుకుని ఎన్ జీఓ సంస్థను నిర్వహిస్తున్నామని తెలిపింది.
అక్రమ గనులు, అణు స్థావరాలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఇండియా పోరాటం చేస్తున్నది. ఇప్పుడు ఐటి, బిటి సంస్థలను టార్గెట్ చేసుకుని పోరాటం చేస్తున్నదని ఆరోపణలు వచ్చాయి. ఇదే సంస్థలో పై అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గ్రీన్ పీస్ ఇండియా మాజీ ఉద్యోగిని గతంలో సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.