కాసేపట్లో గవర్నర్ కీలక ప్రకటన: ఉత్కంఠలో పన్నీర్, శశికళ!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడులో నాటకీయ పరిణామాలు క్లైమాక్స్ కు చేరాయి. కాసేపట్లో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు కీలక ప్రకటన చెయ్యనున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే. రాజేంద్రన్ తో చర్చలు జరిపారు.
శుక్రవారం మద్యాహ్నం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ను రాజ్ భవన్ కు పిలిపించుకుని ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటు విషయంపై చర్చించారు.

ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకు వెళ్లిన శశికళ వర్గం వారిని నిర్బంధించారని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు డీజీపీ టీకే. రాజేంద్రన్ ఎమ్మెల్యేలను తీసుకుని రాజ్ భవన్ చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎమ్మెల్యేలతో మాట్లాడిన తరువాత గవర్నర్ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం పన్నీర్ సెల్వం, శశికళ వర్గంతో పాటు ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీతో సహ తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుకు మనవి చేశారు. ప్రజల్లో శశికళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని దేశం మొత్తం ఆసక్తి ఎదరు చూస్తోంది
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications