బలపరీక్షలో కోర్టు జోక్యమేంటీ, గవర్నర్ చర్య తీసుకుంటారు: ముకుల్ రోహత్గి
రాష్ట్రంలో బలపరీక్ష నిర్వహించే అధికారం గవర్నర్కు ఉంటుందని బీజేపీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కానీ కోర్టులు జోక్యం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం మేరకు గవర్నర్ నడుచుకుంటారని తెలిపారు. గవర్నర్ ప్రొటెం స్పీకర్ లేదంటే స్పీకర్ను నియమించి బలపరీక్ష నిర్వహించాలని కోరతారని తెలిపారు. కానీ అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని మాత్రం ఆదేశించలేదని పేర్కొన్నారు.
తప్పేం లేదు...
ఫడ్నవీస్తో అజిత్ పవార్ కలిసొస్తానని చెప్పారని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. ఇండిపెండెంట్ల బలంతో తమ సంఖ్య 170కి చేరిందన్నారు. కానీ తర్వాత శరద్ పవార్ మాత్రమే హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారని గుర్తుచేశారు. బీజేపీ, ఎన్సీపీ, ఇండిపెండెంట్లు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. గవర్నర్ విచక్షణాధికారంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ముకుల్ రోహత్గి తెలిపారు.

అధికారం లేదు...
గవర్నర్ చర్య తప్పు కాదని పేర్కొన్నారు. గవర్నర్ చర్యను తప్పుపట్టి, నిర్ణయించే అధికారం కోర్టుకు లేదన్నారు. రాష్ట్రంలో బలపరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది.. కానీ సుప్రీంకోర్టు మాత్రం ప్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications