Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడు ఎఫెక్ట్: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, గవర్నర్ విద్యాసాగర్ రావ్ భేటీ !

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారడంతో ఆ రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ సోమవారం మద్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారడంతో ఆ రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ సోమవారం మద్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సిగ్, గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తమిళనాడు రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సోమవారం తమిళనాడు స్పీకర్ ధనపాల్ 18 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అనర్హతకు గురైన టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

 Governor Vidyasagar Rao meets Union Home minister Rajnath Singh

విషయం తెలుసుకున్న గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ వెంటనే ముంబై నుంచి ఢిల్లీ చేరుకుని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తమిళనాడు రాజకీయాల విషయంలోనే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని సమాచారం. సోమవారం సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావ్ చెన్నై చేరుకుంటున్నారు.

టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల మీద వేటు పడటంతో తమిళనాడు స్పీకర్ ధనపాల్ మీద ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ ధనపాల్ కావాలనే దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నించారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+