టెక్కీలకు షాక్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సంఘాల ఏర్పాటు నిర్ణయం వెనక్కు
న్యూఢిల్లీ: సాప్ట్వేర్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అనుమతించాలన్న యోచనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకొంది.ఐటీ పరిశ్రమలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని సమాచారం.
సాఫ్ట్వేర్ రంగంలో చోటు చేసుకొన్న పరిస్థితుల కారణంగా టెక్కీలు ఈ ఏడాది ప్రథమార్థంలో ఉద్యోగాలను కోల్పోయారు. ఈ కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ కర్గే అనుమతిస్తామని ప్రకటించారు.అయితే ప్రస్తుతం ఐటీ పరిశ్రమల్లో మార్పులు వస్తున్నందున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకొన్నట్టు కన్పిస్తోంది.

ఐటీలో ఉద్యోగ సంఘాల అనుమతి వెనక్కి
ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అనుమతించాలన్న యోచనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో పెద్దసంఖ్యలో సాఫ్ట్వేర్ పరిశ్రమలో లేఆఫ్లు చోటుచేసుకున్న సమయంలో ఈ విషయంలో కర్ణాటక సర్కార్ సానుకూలంగా స్పందించింది.ఐటీ-బీటీ చట్టానికి సవరణలు అవసరమని, ఈ సవరణలపై ఆందోళనలు నెలకొన్నాయని ఆ సమయంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ కర్గే చెప్పారు.

ఐటీ కంపెనీల్లో నియామకాలు
ఐటీ కంపెనీల్లో స్థబ్ధత వీడి పెద్ద ఎత్తున నియామకాలకు దిగుతుండటంతో యూనియన్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి లేదని భావిస్తున్నామని ఐటీ కార్యదర్శి గౌరవ్ గుప్తా చెప్పారు. ఈ కారణంగానే ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మారిన పరిస్థితులు
ఐటీ రంగంలో పరిస్థితులు మారాయని కర్ణాటక ఐటీ శాఖ అభిప్రాయపడుతోంది.ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్ వంటి కంపెనీలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ప్రారంభించడంతో ఉద్యోగావకాశాల విషయంలో పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు.

నైపుణ్యాల మెరుగు
ప్రస్తుత ఉద్యోగులకు సైతం నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు కంపెనీలు శిక్షణ ఇస్తుండటం మంచి పరిణామమని కర్ణాటక ఐటీ సెక్రటరీ గౌరవ్ గుప్తా చెప్పారు. చెప్పారు.మరోవైపు చెన్నై, పూణేల్లో ఐటీ యూనియన్లు కార్యకలాపాలు కొనసాగుతున్న క్రమంలో బెంగళూర్లోనూ ఐటీ యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications