రైతులతో ముగిసిన చర్చలు -కేంద్రం తిరకాసు -ఆ రెండింటికీ ఓకే -జనవరి 4న మళ్లీ భేటీ
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన ఆరో దశ చర్చలు ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తొలి నుంచీ వాదిస్తోన్న కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చల్లోనూ అదే పట్టును కొనసాగించింది. రైతులు సైతం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. అయితే, ప్రధాన డిమాండ్ కు అదనంగా ఉంచిన ప్రతిపాదనలపై మాత్రం కీలక ముందడుగు పడింది..
రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన చర్చలు మగిశాయని, జనవరి 4వ తేదీన మరోసారి సమావేశం కావాలని ఉమ్మడిగా నిర్ణయించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. నేటి భేటీలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో దాదాపు 5 గంటల పాటు చర్చలు సాగించింది. వీటిలో రెండు డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది..

రైతుల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించే అంశంపై కమిటీ వేసేందుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. అలాగే విద్యుత్ బిల్లులను పెండింగ్లో పెట్టేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని రైతులు ముందుగా తమ ఆందోళనను విరమించాలని కేంద్రం కోరింది. కానీ..

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెబితేనే నిరసనలు విరమించుకుంటామని రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. దీంతో తదుపరి చర్చలు జరిగే జనవరి 4 వరకు రైతుల ఆందోళనలను కొనసాగడం ఖాయమైపోయింది. రైతు సంఘాల నేతలు ఇప్పటి వరకు కేంద్రంతో ఆరు దఫాలుగా చర్చలు జరిపారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో.. రెండు డిమాండ్లపై తప్ప, చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో స్పస్టమైన క్లారిటీ రాలేదు. దాంతో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తూ వస్తున్నారు.

-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications