భారత్లో చిక్కుకున్న విదేశీయుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశం లాక్డైన్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలంతా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాలు లేక ఇబ్బందులు పడిన విషయం చూశాము. ఇక విమానాలు రద్దు కావడంతో దేశ నలుమూలలా విదేశీయులు చిక్కుకుపోయారు. కొందరిని కేంద్రం గుర్తించి కొద్దిరోజుల క్రితం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని తమ సొంత దేశాలకు చేర్చడంలో చర్యలు తీసుకుంది. ఇంకా ఎవరైనా విదేశీయులు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే వారి వివరాల కోసం కేంద్ర పర్యాటక శాఖ ఓ ప్రత్యేక వెబ్సైట్ను లాంచ్ చేసింది.
స్ట్రాండెడ్ ఇన్ ఇండియా పేరుతో ఈ వెబ్సైట్ కేవలం విదేశీయుల కోసమే రూపొందించింది పర్యాటక శాఖ. ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలను పొందుపర్చింది. ఈ కష్ట సమయాల్లో పర్యాటక శాఖ మీకు అండగా నిలుస్తోందని పేర్కొంది. దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులను తమ సొంత దేశాలకు తరలించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందంటూ భరోసా కల్పించింది. ఒకవేళ విదేశాల నుంచి భారత్కు వచ్చి ఈ కష్ట సమయాల్లో ఎక్కడైనా చిక్కుకుని ఉంటే సంబంధిత అధికారులతో టచ్లోకి వచ్చేందుకు కేంద్ర పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలనేదే తమ ప్రథమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

దేశంలో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం http://strandedinindia.com/ అనే ఈ వెబ్సైట్ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వెబ్సైట్కు లాగిన్ అయి పూర్తి వివరాలు తెలిపితే సంబంధిత అధికారులు స్పందించి సహాయం చేస్తారని పేర్కొంది. ఈ వెబ్సైట్లో కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది.
కోవిడ్-19 హెల్ప్లైన్ నెంబరు : +91-11-23978046 లేదా 1075
హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడీ: [email protected]
[email protected]
వాట్సాప్ నెంబర్ (భారత ప్రభుత్వ కోవిడ్-19 హెల్ప్ డెస్క్): +91 9013151515
బీఓఐ హెల్ప్ లైన్: [email protected]
011-24300666
టూరిస్టు హెల్ప్ లైన్: 1363 లేదా 1800 11 1363
ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్కు లాగిన్ అయితే చాలు: http://strandedinindia.com/
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications