సిద్దరామయ్యను కలిసిన గౌతమి కుటుంబ సభ్యులు
బెంగళూరు: కాడుగోడిలోని ప్రగతి కాలేజ్ లో పీయుసీ విద్యాభ్యాసం చేస్తూ అదే కాలేజ్ అటెండర్ జరిపిన కాల్పులలో మరణించిన గౌతమి (18) కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. గౌతమిని హత్య చేసిన మహేష్ ను కఠినంగా శిక్షించాలని సిద్దరామయ్యకు మనవి చేశారు.
జేడీఎస్ పార్టీ విధాన పరిషత్ సభ్యుడు టి.ఎ. శరవణ, పావగడ శాసన సభ్యుడు తిమ్మరాయప్పతో కలిసి గౌతమి కుటుంబ సభ్యులు, గాయాలైన శిరీష కుటుంబ సభ్యులు సిద్దరామయ్యను కలిశారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

అనంతరం బయటకు వచ్చిన ఎంఎల్ సీ శరవణ మీడియాతో మాట్లాడుతూ - నిందితుడు మహేష్ ను ఇప్పటికే అరెస్టు చేశారని, అతను రివాల్వర్ ఎక్కడ నుండి తీసుకు వచ్చాడనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారని సిద్దరామయ్య తమకు చెప్పినట్లు తెలిపారు.నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని సిద్దరామయ్య హామి ఇచ్చారని చెప్పారు.
మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న శిరీషాకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని, ఇప్పటికే అధికారులు ఆసుపత్రికి లేఖ వ్రాశారని సిద్దరామయ్య అన్నారని శరవణ వివరించారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని గౌతమి కుటుంబ సభ్యులు, శిరీష కుటుంబ సభ్యులు చెప్పారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications