జీపీఎస్ నమ్ముకుని వెళ్తే కారును నదిలో పడేసింది: ముగ్గురు మృతి
ఇటీవల కాలంలో జీపీఎస్ను నమ్మి వెళితే ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. జీపీఎస్ను నమ్మి వెళ్లినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. తాజాగా ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. జీపీఎస్ను నమ్మి వెళ్లి ఓ కారు బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటా గంజ్కి వెళుతున్న కారు జీపీఎస్ సహకారంతో ముందుకు కదులుతోంది. అయితే, అలాగే ముందుకు వెళ్లిన కారు బ్రిడ్జి పైనుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటన ఫరీద్పూర్ సమీపంలో చోటు చేసుకుంది.

బ్రిడ్జి పాడైన విషయం తెలియక కారును బ్రిడ్జిపైనుంచి పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు బ్రిడ్జిపైనుంచి పడిన కారులోంచి ముగ్గురిని బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులోని ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సోదరులు కావడం గమనార్హం.
మృతులను ఫరూఖాబాద్కు చెందిన వివేక్ కుమార్, అమిత్ గా గుర్తించారు. మూడో వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరదల కారణంగా ఈ వంతెన మధ్య భాగం నదిలో కూలిపోయింది. ఈ విషయాన్ని జీపీఎస్ అప్డేట్ చేసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
Wrong GPS location took the lives of 3 people in #Bareilly, #UttarPradesh. This location took the car to an under construction bridge in dense fog. Due to fog, the incomplete bridge was not visible and the car fell into the river below. pic.twitter.com/wUdzhABQTg
— Siraj Noorani (@sirajnoorani) November 24, 2024
అయితే, వంతెన పాడైపోయి ఉన్నప్పటికీ.. వాహనదారులు వెళ్లకుండా ఉండేందుకు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులపై బాధితుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications