ఎప్ఐఆర్లో గ్రేటా థన్బర్గ్ పేరు నమోదు చేయలేదు: ఢిల్లీ పోలీసులు, వారిపైనే దర్యాప్తు
న్యూఢిల్లీ:
స్వీడిష్
పర్యావరణ
కార్యకర్త
గ్రేటా
థన్బర్గ్పై
ఇతరులపైగానీ
సైబర్
సెల్
ఎఫ్ఐఆర్
నమోదు
చేయలేదని
గురువారం
ఢిల్లీ
పోలీసులు
తెలిపారు.
రైతుల
నిరసనకు
మద్దతుగా
దేశ
పరువు
తీసే
"అంతర్జాతీయ
కుట్ర"
పై
దర్యాప్తు
చేయడానికి
టూల్కిట్
సృష్టికర్తలపై
ఫిర్యాదు
అందిందని
తెలిపారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా ట్వీట్ చేసిన గ్రేటా థన్బర్గ్.. ఓ టూల్కిట్ను కూడా జతచేశారు. రైతులకు మద్దతు తెలిపేవారికోసం ఈ టూల్కిట్ అంటూ పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా ఉన్న ఓ డాక్యుమెంట్కు ఆ లింక్ తీసుకెళుతుంది.
ఈ డాక్యుమెంట్లో, ట్విట్టర్ లో సంచలనాలు సృష్టించడం, భారత రాయబార కార్యాలయాల వెలుపల నిరసన వంటి వివిధ అత్యవసర చర్యలు జాబితా చేయబడ్డాయి, ఇవి రైతుల నిరసనకు మద్దతుగా తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సమాజంలో అశాంతి, ఘర్షణలకు దారితీసేవిధంగా ఈ డాక్యుమెంట్ ఉండటంతో.. దాన్ని రూపొందించినవారిపై క్రిమినల్, దేశద్రోహ అభియోగాలు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్) ప్రవీణ్ రంజన్ తెలపారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ డాక్యుమెంట్ ఉందన్నారు. అందుకే దీని రూపకర్తలపై వివిధ ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.
అంతేగాక,
జనవరి
26న
జరిగిన
హింసాత్మక
ఘటనలను
కూడా
ఆ
టూల్
కిట్లో
పొందుపర్చారని
సీపీ
తెలిపారు.
ఉగ్రవాద
భావజాలం
కలిగిన
ఓ
ఖలిస్తానీ
సంస్థ
ఈ
టూల్
కిట్ను
రూపొందించినట్లు
ప్రాథమికంగా
నిర్దారించినట్లు
ఆయన
తెలిపారు.
ఎఫ్ఐఆర్లో
థన్బర్గ్
పేరు
చేర్చారా?
అని
మీడియా
అడిగిన
ప్రశ్నకు
సమాధానమిస్తూ..
తాము
ఎవరి
పేరును
చేర్చలేదని
చెప్పారు.
టూల్
కిట్
రూపొందించినవారిపైనే
ఎఫ్ఐఆర్
నమోదు
చేసి,
దర్యాప్తు
చేస్తున్నట్లు
తెలిపారు.
అయితే,
రైతుల
నిరసనపై
థన్బర్గ్
చేసిన
ట్వీట్లు
దాఖలైన
కేసులో
ఉదహరించబడ్డాయి.