యువతిని కొట్టి, జుట్టు కత్తిరించి.. సాముహిక లైంగికదాడి...
న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ నమ్మడం వీలుకాదు. సొంతింటి మనుషులే ఆకృత్యాలకు తెగబడుతుండటంతో .. తన బాధను ఎవరికీ చెప్పుకోలేకపోతోంది మహిళ. ఈ వేధింపుల పర్వం రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మనవారే కదా .. దగ్గరి వారు, బంధవులు, స్నేహితులని మాట్లాడటమే యువతులు చేసిన తప్పవుతుంది. ఆ చనువే మరో అర్థంగా తీసుకొని .. లైంగికదాడులు జరుగుతున్నట్ట ఘటనలు కొకొల్లలు. తాజాగా ఢిల్లీలో కూడా అలాంటి ఘటనే కలకలం రేపుతోంది.
చెల్లిపై అఘాయిత్యం ..!!
ఢిల్లీలోని సాగర్పూర్కు చెందిన ఓ యువతి చదువుకుంటుంది. ఆమెకు ఓ అన్నయ్య ఉన్నాడు. అయితే అతని స్నేహితులు చాలామంది .. అందులో ఇద్దరు, ముగ్గురు ఇంటికొచ్చేవారు. అయితే అన్నయ్య స్నేహితులు కదా అని ఆ యువతితో వారితో మాట్లాడేంది. దీనినే అవాకశం తీసుకున్నారు వారు. వారం రోజుల క్రితం జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం ఆ యువతితో మాటలు కలిపారు. తర్వాత మెల్లిగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికి కూడా ఆమె తనపై జరగబోతున్న లైంగికదాడిని గ్రహించలేకపోయింది. అప్పటికే మరో ముగ్గురు అక్కడే ఉండటంతో అర్థమైంది. కానీ ఐదుగురు కబంద హస్తాల్లో చిక్కుకున్న ఆమె .. తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది. కానీ వీలుకాలేదు.

ప్రతిఘటిస్తే జట్టు కత్తిరించారు
తర్వాత లైంగికదాడి చేయబోతే అడ్డుకోబోయింది. అంతే కోపమొచ్చిన నీచులు .. ఆమెపై దాడిచేశారు. తర్వాత తమ పైశాచికాన్ని ప్రదర్శించారు. జుట్టు కత్తిరించారు. తర్వాత ఐదుగురు సాముహిక లైంగికదాడి చేశారు. తర్వాత ఎలాగోలా తప్పించుకొని ఇంటికి చేరింది యువతి. తర్వాత ఆమె బంధువులు జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేద్దామని పోలీసు స్టేషన్కు వెళ్తే .. కేసు ఫైల్ చేయాల్సిన పోలీసులు అదీ తమ స్టేషన్ పరిధిలోకి రాదని కాకమ్మ కథలు చెప్పారు. చివరికి కేసు నమోదు చేశారు. బాధితురాలికి డీడీయూ దవాఖానలో వైద్య పరీక్షలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని .. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications