లెక్క బరాబర్- ముఖ్యమంత్రి రాజీనామా ..!!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చుక్కెదురైంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉవ్విళ్లూరిన కమలనాథులకు ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా ఇక్కడ పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేసులో ఉండే నాయకుల పేర్లు కూడా అప్పుడే చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి కూడా.
గుజరాత్ను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ జోరుకు హిమాచల్ ప్రదేశ్లో బ్రేకులు పడ్డాయి. ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉన్న మొత్తం స్థానాల సంఖ్య.. 68. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 35 సీట్లు. ఈ మేజిక్ ఫిగర్ను అందుకుంది కాంగ్రెస్. 40 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. వాటిల్లో పలుచోట్ల విజయం సాధించారు. మరిన్ని సీట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఈ పరిణామాల మధ్య బీజేపీ నాయకులు తమ ఓటమికి అంగీకరించారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామని స్పష్టం చేశారు. పొరపాట్లు ఎక్కడ చోటు చేసుకున్నాయో ఆరా తీస్తామని, దీనిపై చర్చించడానికి త్వరలోనే రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అధికార పార్టీపై నిరంతరాయంగా ఒత్తిళ్లను తీసుకొస్తామని జైరామ్ ఠాకూర్ చెప్పారు.

కాగా కొద్దిసేపటి కిందటే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు అందజేశారు. సిమ్లాలోని తన అధికారిక నివాసం నుంచి ఆయన రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అదే సమయంలో గుజరాత్లో భూపంద్ర పటేల్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ నెల 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications