Exit polls 2022:గుజరాత్-హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..?
హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో డిసెంబర్ 8న వెలువడే ఎన్నికల ఫలితాలు తేలుస్తాయి.అంతకంటే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు డిసెంబర్ 5న వెలువడననున్నాయి. దీంతో ఏపార్టీ అధికారంలోకి వస్తుందో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.అయితే ఎగ్జిట్ పోల్స్ కచ్చితమైన ఫలితాలు అందిస్తాయని మాత్రం చెప్పలేము. కొన్ని సార్లు వీటిని తలకిందులు చేస్తూ కూడా ఓటర్లు తీర్పు ఉండే అవకాశం ఉంటుంది.
ఎగ్జిట్ పోల్స్ను ఒక పద్దతి ద్వారా నిర్వహిస్తారు. ఒక సర్వే జరుగుతుంది. ఇందులో ఓటర్లను అనేక ప్రశ్నలు అడుగుతారు. సర్వే చేసే బృందాలు ఓటింగ్ రోజున ఓటరు ఓటు వేసిన తర్వాత పలు ప్రశ్నలు సంధిస్తారు. దీనిని విశ్లేషించి ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీలు ఒక అంచనాకు వస్తాయి. భారత్లో చాలా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. అందులో ప్రధానమైన సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రత్యక్షంగా మీకోసం