కూతురి అసభ్యకర వీడియో ప్రసారంపై నిరసన: జవానును కొట్టి చంపారు
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమార్తె అసభ్యకర వీడియోని ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టినందుకు ఓ జవానును ప్రత్యర్థులు కొట్టి చంపారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ కూతురుపై ఒక అసభ్యకర వీడియోను 15 ఏళ్ల యువకుడు ఆన్లైన్లో పోస్టు చేశాడు. ఈ విషయంపై సదరు జవాను ఆ యువకుడితో కుటుంబంతో మాట్లాడేందుకు వెళ్లాడు.

జవానుతోపాటు భార్య, ఇద్దరు కుమారులు, మేనల్లుడితో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో యువకుడి కుటుంబం, వీరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువకుడి కుటుంబసభ్యులు జవానుపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో జవాను మృతి చెందారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నిందిత యువకుడు, బాధిత యువతికి మధ్య పరిచయం ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ, ఆమెకు సంబంధించిన అభ్యంతకర వీడియోను యువకుడు ప్రసారం చేశాడు. దీంతోనే ఇరుకుటుంభాల మధ్య ఘర్షణ జరిగింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications