గురుదాస్పూర్లో బిజెపికి భారీ షాక్, కాంగ్రెస్ గెలుపు: కేరళలో యూడీఎఫ్
గురుదాస్పూర్ లోకసభ ఉప ఎన్నికల్లో బిజెపికి షాక్ తగిలిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ 1,93,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అమృత్సర్/తిరువనంతపురం: గురుదాస్పూర్ లోకసభ ఉప ఎన్నికల్లో బిజెపికి షాక్ తగిలిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ 1,93,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మూడో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేజర్ జనరల్ సురేష్ ఖజురియా నిలిచారు. బాలీవుడ్ నటుడు, బిజెపి నేత వినోద్ ఖన్నా మృతితో గురుదాస్పూర్కు ఉప ఎన్నిక జరిగింది.
కాగా, ఆరు నెలల క్రితం పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. నాటి అకాళీదళ్ ప్రభుత్వం అన్నింటా విఫలం కావడంతో ఆ ప్రభావం బిజెపి పైన కూడా పడింది. ఇప్పుడు గురుదాస్పూర్ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.
కేరళలోని వెంగర శాసన సభ స్థానాన్ని ఐయూఎంఎల్ నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఖాదర్ విజయం సాధించారు. యూడీఎఫ్ కూటమిలో ఐయూఎంఎల్ భాగస్వామి.
ఉప ఎన్నికల్లో ఐయూఎంఎల్ అభ్యర్థి ఖాదర్ 2,310 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆయనకు 65 వేల పైచిలుకు ఓట్లు రాగా, ఎల్డీఎఫ్ అభ్యర్థి పిపి బషీర్కు 41వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి.