క్షీణించిన హార్దిక్ పటేల్ ఆరోగ్యం: ఆస్పత్రికి తరలింపు
అహ్మదాబాద్: పటీదార్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయనను పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేతలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గత 14 రోజులుగా దీక్ష చేస్తున్న హార్దిక్పటేల్ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న అల్టిమేటం జారీ చేశారు. 24 గంటల్లోగా తమ డిమాండ్లపై చర్చలు ప్రారంభించకపోతే తాను మంచినీరు కూడా ముట్టుకోనని హెచ్చరించారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.
అంతేగాక, కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఈ ఉద్యమం కొనసాగుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గుజరాత్ ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారంపై బీజేపీ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదని పాస్ కన్వీనర్ మనోజ్ పనారా ఆరోపించారు.












Click it and Unblock the Notifications