హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలకు కరోనా: సెల్ఫ్ ఐసోలేషన్
న్యూఢిల్లీ: హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా కరోనా మహమ్మారిన పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఏమీ లేనప్పటికీ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు తెలిపారు.
ఇటీవల తనను కలిసిన వారందరూ కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కోరారు. ఇది ఇలా ఉంటే పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్దు కూడా కరోనా బారినపడ్డారు. ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు.

మంగళవారం బల్బీర్ సింగ్కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. జ్వరంతోపాటు ఒంటి నొప్పులతో ఆయన బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. దీంతో పరీక్షలు నిర్వహించుకోగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ఆయనను కలిసిన వారిని కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి బల్బీర్ సింగ్ ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.
కాగా, హర్యానా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,36,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,320 యాక్టివ్ కేసులున్నాయి. 1,23,286 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,509 మంది కరోనా బారినపడి మరణించారు.
सभी साथियों के लिए सूचना -
— Dushyant Chautala (@Dchautala) October 6, 2020
मेरी Covid-19 की रिपोर्ट positive आई है। मेरा स्वास्थ्य ठीक है। आग्रह है कि बीते कुछ दिनों में मेरे संपर्क में आए लोग अपना ध्यान रखें और डॉक्टर सलाह दें तो टेस्ट करवाएं। pic.twitter.com/whuguUR3bp
పంజాబ్ రాష్ట్రంలో 1,20,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుం ఈ రాష్ట్రంలో 11,982 యాక్టివ్ కేసులున్నాయి. 1,04,355 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3,679 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications