బీజేపీ సంచలనం -ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే -బిల్లుకు హర్యానా గవర్నర్ ఆమోదం
బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం సంచలన హామీని అమల్లోకి తీసుకొచ్చింది. హర్యానాలో ప్రైవేటురంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మంగళవారం మీడియాకు వెల్లడించారు.
హర్యానాలో యువతకి ఇది సంతోషించదగ్గ రోజని, ఇకనుంచి ప్రైవేటు రంంలోని ఉద్యోగాల్లో స్థానిక యువత 75 శాతం వరకు రిజర్వేషన్ పొందొచ్చని డిప్యూటీ సీఎం చౌతాలా పేర్కొన్నారు. ఖట్టర్ సర్కారు 'ది హర్యానా స్టేట్ ఎప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు' పేరిట గతేడాది ఈ బిల్లును తీసుకురాగా, మంగళవారంతో అది చట్టంగా మారింది.

ప్రైవేటు రంగంలో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పన చట్టం.. నెలకు రూ.50 వేల వరకు వేతనాలతో నాలుగింట మూడు వంతుల ఉద్యోగాలను స్థానికులకు రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించారు. ఒకవేళ అర్హులైన స్థానికులు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ అనుమతితో కంపెనీలు వేరే ప్రాంతాల అభ్యర్థులను నియమించుకోవచ్చని ఓ క్లాజ్ కూడా ఈ చట్టంలో ఉంది.
కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గడిచిన మూడు నెలలుగా జరుగుతోన్న నిరసనల్లో హర్యానా రైతులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఖట్టర్ సర్కారు ప్రైవేటు రంగంలో స్థానికులకు 75శాతం రిజర్వేషన్ చట్టాన్ని తేవడం చర్చనీయాంశమైంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications