మమత బాధించారు, వాజ్పేయి విగ్రహావిష్కరణకు డుమ్మా, ప్రతినిధిని కూడా పంపలేదన్న గవర్నర్
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాజ్భవనలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహరి వాజ్పేయి విగ్రహావిష్కరణ కోసం ఆహ్వానిస్తే దీదీ డుమ్మాకొట్టారు. అంతేకాదు తన ప్రతినిధులను కూడా పంపించలేదు. దీనిపై గవర్నర్ జగ్దీప్ స్పందిస్తూ.. మమత వైఖరితో తనకు బాధ కలిగిందన్నారు.
మమతా బెనర్జీ, జగ్దీప్ మధ్య ఇప్పుడే కాదు ఈ ఏడాది జూలైలో గవర్నర్గా నియమించినప్పటి నుంచి వారి మధ్య సఖ్యత లేదు. ఐదు నెలల్లో శాంతి భద్రతలు, వర్సిటీల్లో గొడవ తదితర అంశాలపై ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. కానీ వాజ్పేయ్ విగ్రహావిష్కరణకు కూడా మమత హాజరుకాలేదు. మరో విషయమేమిటంటే 2001 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

బుధవారం వాజ్పేయి జయంతి సందర్భంగా మమతా బెనర్జీ అంజలి ఘటించారు. ఉదయమే ట్వీట్ కూడా చేశారు. కానీ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి మాత్రం హాజరుకాలేదు. సీఎం, మంత్రులు, అధికారులు కూడా రాకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై గవర్నర్ జగ్దీప్ స్పందిస్తూ.. సీఎంకు చాలా పనులు ఉంటాయి, ఆ విషయం తనకు తెలుసు అని.. కానీ ఆమె తన తరఫున ఒక ప్రతినిధిని పంపించిన సరిపోయేదని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించి తాను గత నెలలోనే వారికి ఆహ్వానాలు పంపించినట్టు గుర్తుచేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications