Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన మాజీ సీఎం, నైస్ రోడ్డు స్కామ్ లో ఏం చెయ్యాలో తెలుసు !

బెంగళూరు: బెంగళూరు నగర శివార్ల నుంచి ప్రారంభం అయిన నైస్ రోడ్డు (nice road) స్కామ్ గురించి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి మరోసారి పోరాటానికి దిగి రైతుల నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ (congress) ప్రభుత్వాన్ని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి (kumaraswamy) డైరెక్ట్ గా హెచ్చరించారు.

నైస్ రోడ్డు (nice road) నిర్మాణానికి బెంగళూరు (Bengaluru) నుంచి మైసూరు (Mysuru) వరకు సేకరించేందుకు నోటిఫై చేసిన భూమిని తిరిగి ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి (kumaraswamy)సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నైస్ రోడ్డు (nice road) బాధితులైన రైతు పోరాట కమిటీ, కర్ణాటక ప్రావిన్షియల్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి (kumaraswamy) మాట్లాడారు.

HD Kumaraswamy warned Karnataka CM Siddaramaiah government about Nice Road scam

అదే సమయంలో ఒరిజినల్ అగ్రిమెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉల్లంఘించి కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డుతో నైస్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి (kumaraswamy) డిమాండ్ చేశారు. దీనితో పాటు, నైస్ (nice) సంస్థ యొక్క BMIC పథకాన్ని రద్దు చేయాలని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కుమారస్వామి డిమాండ్ చేశారు.

నైస్ కుంభకోణంపై హౌస్ కమిటీ, క్యాబినెట్ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని, ఇదే సందర్భంగా టోల్‌ (nice road) వసూలు రహదారితో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్లాట్లు ఇవ్వాలని, ఎక్కువ పరిహారం ఇవ్వాలని మాజీ సీఎం కుమారస్వామి పట్టుబట్టారు. అదే సమయంలో రైతుల డిమాండ్లను నెరవేర్చకుంటే తీవ్ర పోరాటానికి దిగుతామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి (kumaraswamy) హెచ్చరించారు.

కర్ణాటక ప్రావిన్స్ రైతు సంఘం అధ్యక్షుడు (kumaraswamy) జీసీ బయ్యారెడ్డి, దళిత సంఘర్ష్ సమితి వి.నాగరాజ్, రైతు సంఘం అధ్యక్షుడు బడగల్‌పురా నాగేంద్ర, కర్ణాటక ప్రావిన్స్ (nice road) రైతు సంఘం ఉపాధ్యక్షుడు బసవరాజు, కర్ణాటక ప్రావిన్స్ శ్రామిక సంఘం అధ్యక్షుడు పుట్టమడు, జనవాది మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి దేవి, ట్రేడ్ యూనియన్ అధ్యక్షురాలు మీనాక్షి సుందరం, నైస్ బాధితుల పోరాట సమితి అధ్యక్షుడు వెంకటాచలయ్య, పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+