G20 summit: రాజ్ఘాట్ను సందర్శించనున్న పలు దేశాల అధినేతలు..
UK ప్రధాన మంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి రాజ్ఘాట్లోని ప్రపంచ నాయకులతో పాటు అక్షరధామ్ ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరారు. సునక్, మూర్తి ఈ రోజు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వెలుపల భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. G20 సమ్మిట్లో ఉన్న సమయంలో భారతదేశంలోని ఆలయాన్ని సందర్శించడానికి సమయం దొరుకుతుందని సునక్ శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు మరియు అక్కడ ఒక మొక్కను నాటడానికి అగ్ర ప్రతినిధులు రాజ్ఘాట్ను సందర్శించనున్నారు. మహాత్మా గాంధీ భక్తి గీతాల ప్రత్యక్ష ప్రదర్శన కూడా ప్లాన్ చేశారు. న్యూఢిల్లీ నేతల డిక్లరేషన్ కూడా నేడు ఆమోదించారు. డిక్లరేషన్ బలమైన, స్థిరమైన, సమతుల్యమైన, సమ్మిళిత వృద్ధిపై కేంద్రీకృతమై ఉంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై (SDGలు) పురోగతిని వేగవంతం చేయడం, స్థిరమైన భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం, 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు, బహుపాక్షికతను పునరుద్ధరించడం డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశం.

చైనా వన్ బెల్ట్, వన్ రోడ్ (OBOR) చొరవను ఎదుర్కోవడానికి భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రారంభించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపాదిత కారిడార్ భారతదేశం, పశ్చిమాసియా, యూరప్ మధ్య ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన సాధనంగా ఆవిర్భవించగలదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్షతన జరిగిన కో-సెషన్లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వైపు అడుగులు వేయాలని పీఎం నరేంద్ర మోడీ, ఇంగ్లాండ్ ప్రధాని రిషఇ సునాక్ భావిస్తున్నారు.
#WATCH | G 20 in India: President of Turkey, Recep Tayyip Erdogan arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/n4h2kvPY4x
— ANI (@ANI) September 10, 2023
#WATCH | G 20 in India | Russian Foreign Minister Sergey Lavrov arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/xeFo2qHxMm
— ANI (@ANI) September 10, 2023
మోడీ సునాక్ శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. స్వేచ్ఛా వాణిజ్యంలో మిగిలి ఉన్న విషయాలపై త్వరలో చర్చించి ఇరు దేశాలకు ఉపయోగపడే విధంగా ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఒప్పంద ద్వారా ఆర్థిక, రక్షణ, సాంకేతిక, హరిత ఇంధనం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారం ఉండనుంది.
#WATCH | G-20 in India | Premier of the People's Republic of China Li Qiang arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/vsBuq6t6He
— ANI (@ANI) September 10, 2023
#WATCH | G 20 in India | United Kingdom Prime Minister Rishi Sunak arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/vKbL88xlNi
— ANI (@ANI) September 10, 2023
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications