అల్లకల్లోలం- కళ్లముందే అన్నీకొట్టుకుపోయాయి..!!
సిమ్లా: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది.

చండీగఢ్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ఈ ఉదయం 8:30 గంటల వరకు 322 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయి వర్షం కురిసిందని పేర్కొంది. ఇది రికార్డ్. ఇప్పటివరకు చండీగఢ్లో 300 మిల్లీమీటర్లకు మించిన వర్షపాతం ఎప్పుడు పడలేదు. అంబాలాలో 224 మిల్లీమీటర్ష వర్షం కురిసింది.

అటు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమౌతోంది. ప్రధాన నదులు ఉప్పొంగాయి. బియాస్, రావి నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. బియాస్ మీద నిర్మించిన పండో రిజర్వాయర్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. దీనితో అధికారులు అన్ని గేట్లను ఎత్తివేశారు. వరదనీటిని దిగువకు విడుదల చేశారు.

దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. బియాస్, రావి నదుల్లో వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు మునకేశాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. వరద నీటి ధాటికి బియాస్ నది పరీవాహక ప్రాంతం కోతకు గురైంది. కొన్ని నివాసాలు, భవన సముదాయాలు చూస్తుండగానే నదిలో పడిపోయాయి. ఒడ్డున పార్క్ చేసి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి.
Unstoppable Beas River.. Red Alert continues for next 24hrs in Himachal Pradesh
— Weatherman Shubham (@shubhamtorres09) July 9, 2023
Stay at Home pic.twitter.com/x1ozGHXtql
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకులెవరూ రావొద్దని హెచ్చరించింది. వర్షాల తీవ్రత తగ్గేంత వరకు రాష్ట్రంలోని కొన్ని పర్యాటక కేంద్రాలను మూసివేసినట్లు తెలిపింది. మూడు జాతీయ రహదారులతో సహా మొత్తం 736 రోడ్లల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొంది.
Beas River on rampage , massive destruction in its path
— Weatherman Shubham (@shubhamtorres09) July 9, 2023
Visuals from Bahang in Manali of Himachal Pradesh pic.twitter.com/zuiKp5x7Sy
సిమ్లాలోని కోట్గఢ్లో ఈ తెల్లవారుజామున ముగ్గురు మృతి చెందారు. ఇల్లు కూలడంతో అందులో నివసిస్తోన్న వారుమృత్యువాత పడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో భార్యాభర్తలు, ఓ చిన్నారి ఉన్నారు. సిమ్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications