పెట్రోల్బంక్ లేడీస్ టాయిలెట్లలో సిసి కెమెరాలు: అరెస్ట్
భోపాల్: పెట్రోల్ బంకులోని మహిళల టాయిలెట్లలో రహస్యంగా అమర్చిన సిసి కెమెరాలను ఓ యువతి గుర్తించి బట్టబయలు చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో చోటు చేసుకుంది. టాయిలెట్లలో కెమెరాను అమర్చినట్లు గుర్తించిన యువతి గోడను బద్దలుగొట్టి చూడగా.. కెమెరా సహా వైర్లు కనిపించాయి.
అదే సమయంలో పరుగున వచ్చిన ఓ వ్యక్తి ఆ కెమెరాను లాక్కును పరారయ్యాడు. దీంతో ఆ యువతి ముఖ్యమంత్రి హెల్ప్లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
టాయిలెట్లలో అమర్చిన ఆ సిసి కెమెరాలో పెట్రోల్ బంక్ కార్యాలయంలోని ఓ కంప్యూటర్కు కనెక్ట్ చేయబడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిసి కెమెరాలను కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సెల్ ఛార్జింగ్ పెడుతూ యువకుడి మృతి
బుంది: ఓ 24ఏళ్ల యువకుడు తన సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా బ్యాటరీ పేలి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోర్మా గ్రామంలో చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెడుతుండగా సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో రాజులాల్ గుర్జార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి మృతి ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.