భారత్లో తగ్గని డెల్టా వేరియంట్ ప్రతాపం: వ్యాక్సిన్ వేసుకున్నవారిపైనా తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: మనదేశంలో ఓ వైపు కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా డెల్టా వేరియంట్ కేసులు ఉండటం కలవరపెడుతోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ గవర్నమెంట్ కన్సోర్టియమ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఐఎన్ఎస్ఏసీవోజీ ఈ మేరకు వెల్లడించింది.

భారత్లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం
దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా డెల్టా వేరియంట్ రకానికి చెందినవేనని, కరోనా వేసుకున్న వారిపైనా ఈ రకం వైరస్ ప్రభావం చూపుతోందని ఐఎన్ఎస్ఏసీవోజీ తెలిపింది. అంతేగాక, వ్యాక్సిన్ ప్రభావాన్ని తగ్గించేలా ఈ వైరస్ ఉందని పేర్కొంది. ఈ డెల్టా వేరియంట్ కారణంగానే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని, మరణం నుంచి తప్పించుకోవచ్చని, ఆస్పత్రికి వెళ్లే అవకాశాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాప్తి కూడా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఎక్కువ కేసులు డెల్టా వేరియంట్ వల్లే..
అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులపైనా డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఐఎన్ఎస్ఏసీవోజీ పేర్కొంటోంది. ప్రస్తుతం ఇటీవల 30,230 నమూనాలను పరీక్షింగా అందులో 20,324 కరోనా వెల్టా వేరియంట్ కేసులుగా తేలాయని ఐఎన్ఎస్ఏసీవోజీ తెలిపింది. మరేదైనా కొత్త వేరియంట్ వచ్చిందా అనేదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపింది.
భారతదేశంలో సెకండ్ వేవ్కు కారణమైన కరోనా డెల్టా వేరియంట్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనదేశంతోపాటు ఈ డెల్టా వేరియంట్ అమెరికా, చైనా, కొరియా లాంటి దేశాల్లో అత్యధికంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా పస్ల కే417ఎన్ మ్యూటేషన్ కారణంగా కొరియాలో అత్యధిక కరోనా కేసులు నమోదువుతున్నాయని తేలింది. ఈ డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్లో మనదేశంలో ఆరోగ్య వ్యవస్థను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. లక్షలాది మంది కరోనా బారినపడగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు దొరక్కపోవడంతో కరోనా బాధితులు ఎక్కువ సంఖ్యలో మరణించారు.

డెల్టా ప్లస్ తీవ్రత తక్కువే..
దేశంలో ఏవై.1, ఏవై.2, ఏవై.3(డెల్టా పస్ల్) కొత్త కేసులు జులై నెలలో వెలుగుచూశాయి. మహారాష్ట్ర 1 శాతం కేసులు నమోదయ్యాయి. అయితే, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి జరగలేదు. ఇప్పటి వరకు 61 డెల్టా ప్లస్ వేరియంట్ లను దేశంలో గుర్తించారు. డెల్టా వేరియంట్ కారణంగానే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
వ్యాక్సిన్ వేసుకున్నవారిపైనా డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండటం గమనార్హం.
Recommended Video

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. కానీ
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,36,605కు తగ్గింది. ఇది గత 150 రోజులలోనే తక్కువ. ఇది మొత్తం కేసుల్లో 1.12 శాతంగా ఉంది. శుక్రవారం నాటికి దేశంలో 57 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్ వాల్యూ లేదా రిడక్షన్ రేట్ ప్రస్తుతం దేశంలో 0.89 శాతానికి తగ్గింది. అయినప్పటికీ దేశంలో ప్రతిరోజు 25వేల కంటే ఎక్కువ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
న్యూ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా జరపాల్సి ఉందని ఐఎన్ఎస్ఏసీవోజీ అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, కరోనా జాగ్రత్తలు తీసుకోవడం, నిబంధనలు పాటించడం చేస్తే దేశంలో కరోనా కేసుల వ్యాప్తి మరింతగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications