12 గంటలుగా భారీ ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న 500 మంది చిన్నారులు..
12 గంటలుగా భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు నరకయాతన పడుతున్నారు. రోడ్లపైనే గంటలతరబడి పడిగాపులు కాస్తున్నారు. ముంబై- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ వలయంలో దాదాపు 500 మంది చిన్నారులు చిక్కుకున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని వసాయ్ ప్రాంతంలో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 12 బస్సుల్లోని స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాదాపు 12 గంటలకుపైగా వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనాల్లోనే ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ట్రాఫిక్ వలయంలో దాదాపు 500 మంది చిన్నారులు, వాహనదారులు చిక్కుకున్నట్లు సమాచారం. పిల్లలంతా 5 నుంచి 10 వ తరగతి చదువుతున్న వాళ్లే కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వీళ్లంతా స్థానికంగా ముంబై, థానే ప్రాంతాలకు చెందిన వాళ్లు.
I challenge the gov. of Maharashtra Ministers to make a travel from Bhiwandi to Wada. The Mumbai Ahmedabad highway for all the reasons is always with hours of traffic snarls. Should even Industries function in Maharashtra any more? @AjitPawarSpeaks @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/xSyeAoarJi
— Vedang Dongre (@VedangDongre) October 14, 2025
ముంబై- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ మంగళవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో ప్రారంభం అయింది. బుధవారం ఉదయం వరకూ అలాగే ట్రాఫిక్ జామ్ కావడంతో చిన్నారులు, ఇతర వాహనదారులు రాత్రంతా ఇబ్బంది పడ్డారు. రహదారి కావడంతో సరిపడ ఆహారం, నీళ్లు లేక నరకయాతన అనుభవించారు. ముంబై, థానే పరిసరాల్లోని 12 స్కూల్లకు చెందిన పిల్లలంతా పిక్ నిక్ కు వెళ్తూ ఇలా చిక్కుకుపోయారు. తమ పిల్లలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారని తెలిసి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ అలాగే ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక్క అంగుళం ముందుకు వెళ్లడానికి గంటల సమయం పడుతోందన్నారు. వీలైనంత త్వరగా ట్రాఫిక్ కు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు, చిన్నారులకు ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. అయితే జాతీయ రహదారిపై రిపేర్ పనులు జరుగుతున్న కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు అధికారులు అంచనావేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications