Assembly election: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముందే కాంగ్రెస్ లో కౌంట్ డౌన్, 30 మందిపై వేటు!
సిమ్లా/ హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగానే పరిసగట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ పార్టీకి చెందిన 30 మంది టాప్ లీడర్ల మీద ఒకేసారి వేటు వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
Romance: దుబాయ్ లో మొగుడు, ఖాళీగా ఉన్నానని కుర్రాడితో ఆంటీ ?, క్లైమాక్స్ లో ఎంతపని జరిగింది?
కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ ఆ పార్టీ సిద్దంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న 30 మంది నాయకులను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆరు సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా ఆ 30 మంది నాయకుల మీద బహిష్కరణ వేటు వెయ్యడం హిమాచల్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
Himachal Pradesh Congress President expelled 30 party leaders from the primary membership of the party for the next six years for anti-party activities pic.twitter.com/BwC35MD9gT
— ANI (@ANI) December 7, 2022
హిమాచల్ పద్రేశ్ రాజధాని సిమ్లా జిల్లా స్థాయి సమితి ఉపాధ్యక్షుడు, మాజీ ఉపాధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది ప్రముఖ నాయకులను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వింగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప్రతిభా సింగ్ 30 మంది నాయకుల మీద సస్పెండ్ చేసింది.
హిమాచల్ ప్రదేశ్ లోని 68 శాసన సభ నియోజక వర్గాలకు నవంబర్ 12వ తేదీన పోలింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో 75.6 శాతం ఓటింగ్ జరిగింది. 2017లో జరిగిన పోలింగ్ ను 2022లో బ్రేక్ చేసింది. 2017లో హిమాచల్ ప్రదేశ్ జరిగిన శాసన సభ ఎన్నికల్లో 74 శాతం ఓటింగ్ జరిగింది.
Marriage: నాలుగు దిక్కుల్లో నలుగురు భర్తలు, ఐదో వాడి కోసం వేటలో ?, మేడమ్ కు 32 ఫోన్ నెంబర్లు!
హిమాచల్ ప్రదేశ్ లోని డోన్ నియోజక వర్గంలో అత్యధికంగా 85,25 శాతం ఓటింగ్ జరిగింది. గురువారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీకి చెందిన 30 మంది లీడర్లను పార్టీ నుంచి బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది.