హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం: బస్సు లోయలో పడి ఏడుగురి మృతి!
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షిమ్లా నుంచి రోహ్రు ప్రాంతంలోని టిక్కర్ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా 26మందికి గాయాలైనట్టు సమాచారం.

మృతుల్లో బస్ డ్రైవర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలేవి తెలియరాలేదు. మృతులను మహిందర్ చౌహన్, సునీల్ శర్మ, తులరామ్, మోటు, సత్య, రాజీవ్ లుగా గుర్తించారు.
Himachal Pradesh: 4 people dead, 26 injured after a Himachal Road Transport Corporation (HRTC) bus rolled down a hill near Theog pic.twitter.com/lo43XFlaM2
— ANI (@ANI) June 1, 2018












Click it and Unblock the Notifications