Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆకస్మిక వరదలు: మునిగిన ఆధ్యాత్మిక క్షేత్రం: నాటి ఉత్తరాఖండ్ ప్రళయం తరహాలో

సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతోన్నాయి. ఆకస్మిక వరదలకు దారి తీస్తోన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కురిసిన భారీ వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి. హిమాలయ పర్వతసానువుల్లోని మాంఝీ నది ఒక్కసారిగా పోటెత్తింది. దీని ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 24 గంటలుగా కురిసిన భారీ వర్షాల వల్ల పోటెత్తిన మాంఝీ నది ధర్మశాలను ముంచెత్తింది.

హిమాచల్ ప్రదేశ్‌లో సుమారు నెలరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తోన్నాయి. వాటి తీవ్రత మరింత పెరిగింది. 48 గంటలుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురిశాయి. దీనితో మాంఝీ నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద తీవ్రత మరింత పెరగడంతో నది పోటెత్తింది. ప్రఖ్యాత బౌద్ధ పుణ్యక్షేత్రం ధర్మశాలను ముంచెత్తింది. ధర్మశాల సమీపంలోని భాగ్‌సు నాగ్ ప్రాంతంపై విరుచుకుపడింది. ఆకస్మిక వరదతో భాగ్‌సు నాగ్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

 Himachal Pradesh: Flash flood in Dharamshalas Bhagsu Nag due to heavy rainfall

కార్లు కొట్టుకునిపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాటి ఉత్తరాఖండ్ ప్రళయాన్ని గుర్తుకు తెచ్చింది. భారీ వర్షాల వల్ల హిమచాల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతోన్నాయి. సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్ ఏరియా ఝాక్రీ వద్ద కొండ చరియలు విరుచుకుపడటంతో జాతీయ రహదారి మూసుకుపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొండచరియలను తొలగిస్తోన్నాయి.

అటు జమ్మూకాశ్మీర్‌లోనూ భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. గండెర్బల్ జిల్లాలోని వాట్లర్ ఏరియాలో బురద పేరుకుపోయింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పాల్‌ఘర్, ముంబై, థానేల్లోనూ ఈ నెల 15వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మూడు జిల్లాల కోసం ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ కేంద్రం అధికారులు జారీ చేశారు.

Recommended Video

    Importance Of Jeepneys In The Philippines, జీప్ డ్రైవర్ లైఫ్ ఇదీ || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+