వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం కాన్యాయ్ వాహనం ఢీకొని రోడ్డు దాటుతూ వ్యక్తి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ కాన్వాయ్ వాహనం ఢీకొని సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఒకటో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ముఖ్యమంత్రి పైలట్ వాహనానికి చెదిన ఇద్దరు పోలీసులు ఈ ప్రమాదంలో గాయపడినట్లు పోలీసు సూపరింటిండెంట్ అభిషేక్ గార్గ్ చెప్పారు.

పాదచారుడైన మృతుడు జాతీయ రహదారిని దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. రోడ్డు దాటుతుండగా అతన్ని పైలట్ వాహనం ఢీకొట్టింది. మృతుడిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.

Hit by CM Manohar Lal Khattar's convoy, man dies near Karnal

ప్రమాదం చండీగఢ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో గల తరోరీ సమీపంలో జరిగింది. సోమవారం సాయంత్రం కత్తార్ ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వస్తుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తిని కల్పనా చావ్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, చాలా చోట్ల దెబ్బ తగలడంతో ఆ వ్యక్తి మరణించాడు.

English summary
An unidentified person died here on Monday night after a vehicle in the convoy of chief minister Manohar Lal Khattar hit him on the national highway -1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X