సిఎం కాన్యాయ్ వాహనం ఢీకొని రోడ్డు దాటుతూ వ్యక్తి మృతి
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ కాన్వాయ్ వాహనం ఢీకొని సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఒకటో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ముఖ్యమంత్రి పైలట్ వాహనానికి చెదిన ఇద్దరు పోలీసులు ఈ ప్రమాదంలో గాయపడినట్లు పోలీసు సూపరింటిండెంట్ అభిషేక్ గార్గ్ చెప్పారు.
పాదచారుడైన మృతుడు జాతీయ రహదారిని దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. రోడ్డు దాటుతుండగా అతన్ని పైలట్ వాహనం ఢీకొట్టింది. మృతుడిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.
ప్రమాదం చండీగఢ్కు 20 కిలోమీటర్ల దూరంలో గల తరోరీ సమీపంలో జరిగింది. సోమవారం సాయంత్రం కత్తార్ ఢిల్లీ నుంచి చండీగఢ్కు వస్తుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తిని కల్పనా చావ్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, చాలా చోట్ల దెబ్బ తగలడంతో ఆ వ్యక్తి మరణించాడు.