"ఆరు విమానాల్లో బాంబులు పెట్టాం జాగ్రత్త"

న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు.

విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ఫోన్ లు చేశారు. శనివారం వేకువ జామున నుంచి పదే పదే బెదిరింపు ఫోన్ లు రావడంతో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు.

 Hoax Bomb Threat at Delhi and Bengaluru Airport’s

దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు విమానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విదేశాలకు బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలను మళ్లి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి రప్పించి తనిఖిలు చేశారు.

వివమానాల్లో ఎలాంటి బాంబులు లేవని నిర్దారించుకున్న తరువాత రెండు విమానాలను తిరిగి పంపించారు. కొందరు అకతాయిలు కావాలనే బాంబు బెదిరింపు ఫోన్ లు చేశారని పోలీసు అధికారులు అన్నారు. గుర్గావ్ నుంచి ఒక ఫోన్ వచ్చిందని, మిగిలిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+