శారదా స్కాంలో సిబిఐపై ఒత్తిడి: హోంశాఖ కార్యదర్శి గోస్వామికి ఉద్వాసన
న్యూడిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణంలో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి మాతంగ్ సింగ్ను కాపాడేందుకు ప్రయత్నాలు సాగించారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనీల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశం మేరకు అనీల్ గోస్వామి బుధవారం రాత్రి తన పదవి నుంచి వైదొలిగారు.
ఆయన స్థానే హోం శాఖ కొత్త కార్యదర్శిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి ఎల్.సి. గోయల్ను నియమించారు. గోస్వామిని పిఎంఓ కార్యాలయానికి పిలిపించిన సీనియర్ అధికారులు మాతంగ్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు అధికారులపై ఒత్తిడి తెచ్చిన అంశం గురించి ప్రశ్నించారు. మాతంగ్ సింగ్ అరెస్టు విషయంలో గోస్వామి తమపై వత్తిడి తెస్తున్నారని సిబిఐ డైరక్టర్ ప్రధాన మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సిబిఐ ఫిర్యాదు మేరకు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఉదయం అనీల్ గోస్వామిని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. మాతంగ్ విషయంలో సిబిఐ అధికారులతో టెలిఫోన్లో మాట్లాడినట్లు గోస్వామి అంగీకరించారు. అనంతరం గోస్వామితో జరిపిన చర్చలపై ఒక నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయానికి రాజ్నాథ్ పంపించారు.
ఆ నివేదికలోని అంశాల్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ పిఎంఓ సీనియర్ అధికారులతో చర్చించారు. ఆ నేపధ్యంలో గోస్వామిని పిలిపించుకున్న పిఎంఓ అధికారులు అనేక అంశాలపై ఆయన్ని ప్రశ్నించారు. అధికారుల ఆదేశం మేరకు బుధవారం రాత్రి అనీల్ గోస్వామి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications