పరువు హత్య కలకలం: కులపిచ్చి ముందు కన్నప్రేమ ఓడిపోయింది!
కర్ణాటకలో కుల దురహంకారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గర్భిణి అని కూడా చూడకుండా కన్నకూతురినే తండ్రి దారుణంగా కొట్టి చంపిన హృదయవిదారక ఘటన హుబ్బళ్లిలో చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆరు నెలల గర్భిణి అయిన సొంత కూతురిని తండ్రి, బంధువులు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది.
కులాంతర వివాహమే శాపమైందా?
మృతురాలు మాన్య పాటిల్(19) అదే గ్రామానికి చెందిన వేరే కులం యువకుడిని ఈ ఏడాది మే నెలలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం మాన్య తండ్రి ప్రకాష్కు అస్సలు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని భయపడిన మాన్య.. భర్తతో కలిసి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవేరి జిల్లాలో నివసించేది. చాలా కాలం దూరంగా ఉన్న మాన్య దంపతులు.. ఇటీవల డిసెంబర్ 8న తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వీరి రాకను గమనించిన మాన్య తండ్రి ప్రకాష్, ఇతర బంధువులు ఆమెపై కక్ష పెంచుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నం మాన్య భర్త, మామ పొలంలో ఉండగా.. నిందితులు వారిపై దాడికి ప్రయత్నించారు. అయితే వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో నిందితులు ఇనుప పైపులతో మాన్య అత్తగారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆరు నెలల గర్భిణి అయిన మాన్యను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కొట్టారు. ఆమెను కాపాడబోయిన మాన్య అత్త రేణుకను, మామ సుభాష్లను కూడా నిందితులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిగా తరలించగా.. మాన్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అత్తమామలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల చర్యలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మాన్య తండ్రి ప్రకాష్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కులం కోసం కన్నప్రేమను మర్చిపోయి, పుట్టబోయే బిడ్డతో సహా కూతురిని చంపేసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
-
మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్ -
బెట్టింగ్ యాప్లకు బిగ్ షాక్… 300 ప్లాట్ఫామ్లు బ్లాక్ చేసిన ప్రభుత్వం -
'మనిద్దరిది ఒకే మతం.. నాతో ఆ పనిచేస్తేనే న్యాయం చేస్తా' -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications