దుష్యంత్ కే పట్టం: హుడా కుమారుడికి డిప్యూటీ: హర్యానాలో కాంగ్రెస్-జేజేపీ సంకీర్ణ సర్కార్
చండీగఢ్: హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టే.. కింగ్ మేకర్ గా ఆవిర్భవించిన జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా అందలం ఎక్కడం ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక లాంఛన ప్రాయమే. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జేజేపీతో పొత్తు కలిసి హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా అనే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టత ఇచ్చింది. దుష్యంత్ చౌతాలాకు ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధపడింది.

కాంగ్రెస్-జేజేపీ సంకీర్ణ కూటమి సారథ్యంలో..
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన దుష్యంత్ చౌతాలాను ఆహ్వానించారు.. అధికారికంగా. కాంగ్రెస్-జేజేపీల సారథ్యంలో హర్యానాలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే అంశంపై అటు కాంగ్రెస్ గానీ, ఇటు జేజేపీ గానీ ఇంకా ఎలాంటి నిర్ణయానికీ రాలేదు. అయినప్పటికీ- ఉప ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ కు కేటాయించాలనే షరతును విధించినట్లు తెలుస్తోంది.

దీపేందర్ సింగ్ హుడాకు డిప్యూటీ..
భూపీందర్ సింగ్ హుడా కుమారుడు దీపేందర్ సింగ్ హుడాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన భూపీందర్ సింగ్ హుడా.. ఈ సారి రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన దుష్యంత్ చౌతాలా చేతి కింద పని చేయడానికి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించడానికి ఎంత మాత్రమూ సుముఖంగా లేరని తెలుస్తోంది. తనకు బదులుగా కుమారుడు దీపేందర్ సింగ్ హుడాకు ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని ఆయన భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం హర్యానా రాజకీయాలు సాగుతున్నాయి.

హుడాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సోనియా..
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పరిస్థితుల్లో అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. భారతీయ జనతాపార్టీ అందలం ఎక్కకుండా చేయడానికి ఎలాంటి చర్యలకైనా దిగాలని తీర్మానించుకుంది. హర్యానా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రాష్ట్ర రాజకీయ నాయకులకే బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాము దానికి అంగీకరిస్తామని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. కొద్దిసేపటి కిందటే ఆమె భూపీందర్ సింగ్ హుడాతో ఫోనులో మాట్లాడారు. దీనితో- ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన దుష్యంత్ చౌతాలాను ఆహ్వానించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications