హక్కుల నేతల గృహనిర్భంధం సెప్టెంబర్ 12 వరకు పొడగించిన సుప్రీంకోర్టు
మావోయిస్టులతో సంబంధాలు నెరుపుతున్నారన్న అనుమానంతో ఐదుమంది హక్కులనేతల గృహనిర్భంధాన్ని సెప్టెంబర్ 12 వరకు పొడగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హక్కుల నేతల అరెస్టుకు సంబంధించి కోర్టులో ఇంకా వాదనలు జరుగుతున్నందున మహారాష్ట్ర పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించేలా సూచించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
గతనెలలో దేశవ్యాప్తంగా హక్కుల నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో లాయర్ ట్రేడ్ యూనియన్ యాక్టివిస్టు సుధా భరద్వాజ్, విరసం నేత వరవరరావు, పౌరహక్కుల కార్యకర్త జర్నలిస్టు గౌతమ్ నవ్లఖా, అరుణ్ ఫెరీరా వెర్నాన్ గొన్సాల్వేస్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలతో హింస రాజేసేందుకు చూశారని పోలీసులు ఆరోపించారు.

భీమా కోరెగావ్లో చోటుచేసుకున్న హింసకు కారణం వీరి ప్రసంగాలేనంటూ పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో వీరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంత పెద్ద ఎత్తున హింసను సృష్టించేందుకు ప్రణాళిక రచించారని పోలీసులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపితే అరెస్టులు చేస్తారా అనేదానిపై దాఖలైన పిటిషన్పై సుప్రీంలో వాదనలు జరిగాయి. ఆ సందర్భంగా నిరసనలు తెలిపినందుకు హక్కుల నేతలను అరెస్టు చేయలేదని... పెద్ద ఎత్తున హింస సృష్టించేందుకు వ్యూహ రచన చేసినందుకే అరెస్టులు చేసినట్లు సుప్రీం కోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications