ఆదిపురుష్ వివాదంలో కేంద్రం జోక్యం- సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు?
అమరావతి: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు.
నేపాల్ ప్రభుత్వం సైతం ఈ సినిమాపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీతమ్మతల్లి భారత్లో జన్మించినట్లు ఉన్న డైలాగ్ను తొలగించాలంటూ ఆదేశించింది నేపాల్. నిజానికి- సీతమ్మ జన్మించిన జనక్పూర్ ప్రస్తుతం నేపాల్లో ఉండటమే దీనికి కారణం. ఆ డైలాగ్ను తొలగించిన తరువాతే తమ దేశంలో ఈ సినిమాను ప్రదర్శించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అటు క్రిటిక్స్ ఆదిపురుష్పై చేస్తోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రామాయణాన్ని సమూలంగా మార్చేసేలా ఈ కథను తీర్చిదిద్దారంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా చూపిస్తోన్నారు. రామాయణాన్ని చివరికి ఓ కల్పిత గాథగా భావించేలా దర్శకుడు ఓం రౌత్ సినిమాను తీశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. బాబు గోగినేని వంటి హేతువాదులు సంధించే విమర్శలు మరో ఎత్తు.
मैंने 'आदिपुरुष' के बारे पढ़ा और सुना। अत्यधिक पीड़ा हो रही है कि आख़िर कैसे सेंसर बोर्ड ने एक ऐसी फ़िल्म को सर्टिफिकेट दे दिया जो हमारी आस्था से खिलवाड़ कर रही है, हमारे आराध्य का मजाक उड़ा रही है.
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 17, 2023
केंद्र सरकार को इसका जवाब देना होगा.
हमारे भाँचा राम का अपमान हम नहीं सहेंगे.… pic.twitter.com/QA7yk9r7JY
తాజాగా ఆదిపురుష్పై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సైతం విమర్శలు చేశారు. ఆదిపురుష్ గురించి వార్తల్లో చదివానని, స్క్రిప్ట్ గురించి తెలుసుకున్నానని, కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కించపరిచేలా సినిమా ఉందని అన్నారు. ప్రజల భక్తి, విశ్వాసాలతో ఆటలాడుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారాయన.
ఇలాంటి సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం బాధాకరమని భూపేష్ బఘేల్ అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, హిందువులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీరామచంద్రుడిని ఛత్తీస్గఢ్ ప్రజలు తమ మేనల్లుడిగా భావిస్తారని, అలాంటి రాముణ్ని అవమానిస్తే సహించబోమనీ తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి. దీనికి బాధ్యులైన వారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications